గ్రామాలే తరిలి వస్తున్నాయి టిప్పర్ డ్రైవర్ కు ఎన్నికల ప్రచారంలో
జన హృదయాల్లో జగనన్నకు సుస్థిర స్థానం
రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ
ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ
టిడిపి మాయమాటలు నమ్మవద్దు
వైఎస్సార్సీపీ తోనే సంక్షేమాభివృద్ధి.
అందరికీ మంచి చేసే జగనన్నకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.
శింగనమల మండలం చిన్నమట్లగొంది, పెద్ద మట్లగొంది, ఈస్ట్.నరసాపురం, సోదనపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నిక ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ చేపట్టారు.
ఆయా గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వారు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయేలా పాలన అందించారన్నారు. అటువంటి గొప్ప పాలనలో తాము కూడా భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్సిపి తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో పేదలకు సంక్షేమాన్ని దూరం చేసిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో విధ్వంస పాలన సాగించారన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ మోసాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేస్తే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులమైన తమను "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 21 2024, 07:38